టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా రేపు పార్టీ కార్యకర్తలందరూ ఎక్కడివారు అక్కడే ఉండాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కార్యకర్తలు తమ ఇండ్లపైనే పార్టీ జెండా ఎగరవేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా సామాజిక దూరాన్ని పాటిస్తూ రక్తదాన కార్యక్రమాన్ని వారం రోజుల పాటు కొనసాగించాలని పిలుపునిచ్చారు.
కరోనా కష్టకాలంలో చుట్టుపక్కల అవసరం ఉన్నవారిని ఆదుకోవాలని సూచించారు. తాము చేసే ప్రతి కార్యక్రమంలో వ్యక్తిగతంగా.. భౌతికంగా దూరాన్ని పాటించాలని పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ సూచించారు. ఈ కష్టకాలంలో చుట్టుపక్కల అవసరం ఉన్నవారికి ఆదుకోవాలి. 20 సంవత్సరాల పాటు ప్రజల్లో మమేకమైన అనుభవంతో మరోసారి ప్రజల సేవకు పునరంకితమవుదామన్నారు.