టాలీవుడ్ నటుడు వెంకటేష్ ఆదివారం రాత్రి గచ్చిబౌలి స్టేడియంలో సందడి చేశారు. ఇండియన్ సూపర్లీగ్లో భాగంగా హైదరాబాద్ ఎఫ్సీ×ఎఫ్సీ గోవా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకువ వెంకటేష్ గచ్చిబౌలి స్టేడియానికి విచ్చేశారు. ఆయన పాటు, ‘వెంకీమామ’చిత్ర దర్శకుడు కె.ఎస్.రవీంద్ర(బాబి), నిర్మాత సురేష్బాబు, మరో దర్శకుడు క్రిష్ కూడా ఉన్నారు. వెంకటేష్ మ్యాచ్ను వీక్షిస్తున్న ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
నాగచైతన్యతో కలిసి వెంకటేష్ నటించిన తాజా చిత్రం ‘వెంకీమామ’. రాశీఖన్నా, పాయల్రాజ్పుత్ కథానాయికలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్కు విశేష స్పందన వస్తోంది.