భారత టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. బీఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ వినియోగదారులకు ఇక ఉచిత ఇంటర్నెట్ సేవలు లభించనున్నాయి. శుక్రవారం నుంచి 30 రోజుల్లోగా 5 జీబీ డేటా ఉచితంగా వినియోగించుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు తిరుపతి టెలికాం జీఎం న్యూటన్ వెల్లడించారు.
నగరంలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రూ.299 ప్లాన్ తీసుకున్న ల్యాండ్లైన్ వినియోగదారులకు ఈనెలాఖరు వరకు 5 జీబీ డేటాను ఉచితంగా వినియోగించుకోవచ్చని తెలిపారు. ఇప్పటికే ఈ ప్లాన్లో ఉన్నవారికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. గతంలో ప్లాన్లో ఉండి రద్దు చేసుకుంటే రూ.299 చెల్లించి పునరుద్ధరించుకోవచ్చని వివరించారు. దీంతోపాటు సంస్థ వినియోగదారుల నడుమ అపరిమిత ఉచిత కాల్స్, ఇతర నెట్వర్క్లకు రూ.300 విలువైన కాల్స్ చేసుకోవచ్చని తెలిపారు.