telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇక ఉచిత ఇంటర్నెట్‌ సేవలు!

BSNL free internet landline

భారత టెలికాం రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌లైన్‌ వినియోగదారులకు ఇక ఉచిత ఇంటర్నెట్‌ సేవలు లభించనున్నాయి. శుక్రవారం నుంచి 30 రోజుల్లోగా 5 జీబీ డేటా ఉచితంగా వినియోగించుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు తిరుపతి టెలికాం జీఎం న్యూటన్‌ వెల్లడించారు.

నగరంలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రూ.299 ప్లాన్‌ తీసుకున్న ల్యాండ్‌లైన్‌ వినియోగదారులకు ఈనెలాఖరు వరకు 5 జీబీ డేటాను ఉచితంగా వినియోగించుకోవచ్చని తెలిపారు. ఇప్పటికే ఈ ప్లాన్‌లో ఉన్నవారికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. గతంలో ప్లాన్‌లో ఉండి రద్దు చేసుకుంటే రూ.299 చెల్లించి పునరుద్ధరించుకోవచ్చని వివరించారు. దీంతోపాటు సంస్థ వినియోగదారుల నడుమ అపరిమిత ఉచిత కాల్స్‌, ఇతర నెట్‌వర్క్‌లకు రూ.300 విలువైన కాల్స్‌ చేసుకోవచ్చని తెలిపారు.

Related posts