వైసీపీ ప్రభుత్వంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కౌలు రైతుల పట్ల మాకున్న చిత్తశుద్దిని శంఖించలేరని ఆయన పేర్కొన్నారు.
పవన్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని.. మమ్మల్ని ప్రశ్నించే ముందు గతాన్ని ఓసారి గుర్తుచేసుకోవాలన్నారు. మీరు బలపర్చిన సర్కార్ రుణమాఫీగా అరకొర నిధులే ఇచ్చిందంటూ పేర్ని నాని దుయ్యబట్టారు. పీఎం కిసాన్ యోజనలో కౌలు రైతులు లేరనే విషయం పవన్కు తెలుసా అని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పథకాలు అమలు చేస్తుంటే పవన్ కళ్యాణ్కు కనపడటం లేదా అని ప్రశ్నించారు.
2014లో తనను చూసి ఓటేయమన్నారని.. టీడీపీ, బీజేపీ ప్రభుత్వం తప్పు చేస్తే తాను ప్రశ్నిస్తానని పవన్ అన్నారని గుర్తు చేశారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఒక్క పైసా కూడా మీరు ఎందుకు తేలేకపోయారని పవన్ కళ్యాణ్ను పేర్ని నాని ప్రశ్నించారు.
అసలు బీజేపీతో కలిసి మీరు ఈ రాష్ట్రానికి ఏం తెచ్చారని నిలదీశారు. ప్రశ్నిస్తానని చెప్పి చేయని పవన్ను ప్రజలు నిలదీయాలని పేర్ని నాని కోరారు.
పవన్ కల్యాణ్కు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో కౌలు రౌతులకు చట్టం చేయించాలని అన్నారు. వచ్చేఎన్నికల్లో జనసేన ఒంటిరిగా పోటీచేస్తే ..చంద్రబాబు దత్తపుత్రుడు కాదని ఒప్పకుంటామని అన్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ప్రజలు జగన్ వెంటే ఉన్నారని పేర్ని నాని అన్నారు.
అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీని ప్రశ్నించటమే పవన్ కు తెలుసు అంటూ నాని విమర్శలు చేశారు. ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తే రాజకీయ నాయకుడు అయినంత మాత్రాన చర్యలు తీసుకోకుడదా? అంటూ నాని ప్రశ్నించారు .