telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పులిచింతల ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి: అనిల్‌కుమార్‌

minister anil kumar

పులిచింతల ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తానని ఏపీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. “పులిచింతల జల హారతి” కార్యక్రమంలో అనిల్‌ కుమార్‌ తోపాటు రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రులు కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, చీరె, సారెలను సమర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి అనిల్‌ మీడియాతో మాట్లాడుతూ.. పులిచింతల ప్రాజెక్టు వద్ద సుమారు 45 అడుగుల వైఎస్సార్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే వైఎస్సార్‌ స్మృతి వనం, పార్కును నిర్మిస్తామని తెలిపారు. వైఎస్సార్‌ విగ్రహంతో పాటు డా. కెఎల్‌ రావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.ప్రాజెక్టు నిర్మించిన తర్వాత మొట్టమొదటి సారిగా పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడం శుభపరిణామం అన్నారు.

Related posts