వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. లోక్సభలో వైసీపీ పక్ష నేతగా ఎంపీ మిథున్ రెడ్డి వ్యవహరించనున్నారు. పార్టీ చీఫ్ విప్గా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రొటెం స్పీకర్గా చిన్న అప్పలనాయుడును నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ముగ్గురినీ ఆయా పదవుల్లో నియమిస్తున్నట్లు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 3న కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి లేఖ రాశారు. వీరి నియామకాలను అధికారికంగా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఆయా ప్రభుత్వ శాఖల కమిటీల అధికారులు వీరి నియామకాన్ని గుర్తించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.