టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
సీఎం జగన్ ను ఎక్కువగా మాట్లాడితే అచ్చెన్నాయుడికి తాట తీస్తానని..ఆంకుశం సినిమాలో విలన్ని కొట్టినట్టు టెక్కలి రోడ్లపై ఈడ్చి.. ఈడ్చి.. దొర్లించి.. దొర్లించి కొట్టకపోతే తాను దువ్వాడనే కాదన్నారు.
మహనాడులో జగనన్నగురించి ఇష్టానుసారం పేలినటువంటి వ్యక్తులకే ఇదే నా హెచ్చరిక..హద్దులు మీరి మాట్లాడితే సహించేది లేదన్నారు.
జగన్ కోసం ప్రాణాలర్పించేందుకైనా .. తాను ఆత్మాహుతి దళంగా మారేందుకైనా తాను సిద్ధమని అన్నారు. నాకు ప్రాణం మీద భయం లేదు..జీవితం మీద ఆశలేదు..నిన్నురాజకీయ పతనం చేయడమే నా ఆశయం.. వల్లు దగ్గర పెట్టుకో అచ్చన్నాయుడు అంటూ దువ్వాడ హెచ్చరించారు.
ఇప్పుడే కాదు రానున్న రోజుల్లో కూడా మళ్ళీ ఈ టీడీపీ రాదు..భూస్థాపితం కావడం తప్పదు అంటూ మండిపడ్డారు.
కూటమి పార్టీలన్నింటికి అవినీతి చరిత్ర: మోదీ