కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అధికారం కోల్పోయి సతమతమవుతున్న పార్టీని.. వరుస సీనియర్ నేతల రాజీనామాలు మరింత కుంగదీస్తున్నాయి.
తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ కాంగ్రెస్కు గుడ్ బై చెప్పారు. అంతేకాదు అనూహ్యంగా సమాజ్వాదీ పార్టీ మద్దతుతో ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు.
మే 16నే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు నామినేషన్ అనంతరం సిబల్ వెల్లడించారు. తాను స్వతంత్ర అభ్యర్థిగానే నామినేషన్ దాఖలు చేశానని, ఎస్పీ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. ఎప్పటినుంచో రాజ్యసభలో స్వతంత్ర గొంతుక కావాలనుకుంటున్నట్లు చెప్పారు.
ఇప్పుడీ పరిణామాలు దేశరాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఇవాళ ఉదయం లక్నోలో ఆయన రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ వేశారు. కపిల్ సిబల్ వెంట సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఉన్నారు.
ఎగ్జిట్ పోల్స్ తనను షాకింగ్ కు గురిచేశాయి: కేఏ పాల్