telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రౌడీషీటర్లే విధ్వంసం సృష్టించారు..దాడి చేసిన అంద‌రిని శిక్షిస్తాం – మంత్రివిశ్వ‌రూప్‌

*అమ‌లాపురం నివాసానికి మంత్రివిశ్వ‌రూప్‌..

*అమలాపురం ప్రజలు మంచోళ్లని చెప్పారు
*నిన్న‌టి దాడుల్లో పూర్తిగా ద‌గ్ధ‌మైన మంత్రి ఎస్కార్ట్ వాహ‌నం
*ఆందోళ‌న‌లో ధ్వంస‌మైన త‌న ఇంటి ప‌రిశీలించిన మంత్రి విశ్వ‌రూప్‌
*గొడ‌వ‌ల‌ను డైవ‌ర్ట్ చేయ‌డానికి త‌న ఇంటిని త‌గ‌లుబెట్టార‌ని మంత్రి వెల్ల‌డి
*దాడి చేసిన అంద‌రిని శిక్షిస్తాం..

నిరసనకారులు తగలబెట్టిన తన ఇంటిని మంత్రి విశ్వరూప్‌ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ..అంద‌రూ సంయ‌మనం పాటించాలి అని మంత్రివిశ్వ‌రూప్ తన కార్యకర్తలను కోరారు.. మేము క్షేమంగా ఉన్నాం ఎవ‌రూ ఆందోళ‌ణ ప‌డోద్దు అని అన్నారు.

తన ఇంటిని తగలబెట్టడం దురదృష్టకర‌మ‌ని అన్నారు. అమలాపురం ప్రజలు మంచోళ్లని చెప్పారు. ఫ్రీ ప్లాన్డ్‌గా సంఘ విద్రోహ శక్తులే దారి మళ్లించి త‌న ఇంటిపై విధ్వంసం సృష్టించారన్నారు.

నిరసనకారుల ఆందోళనల్లో రౌడీషీటర్లు వచ్చారు. రౌడీషీటర్లే విధ్వంసం సృష్టించారని మంత్రి విశ్వరూప్‌ అన్నారు.

పోలీసులు ఇప్పటికే  హింసకు పాల్పడిన కొందరిని అరెస్ట్ చేశారని తెలిపారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని మంత్రి విశ్వరూప్‌ అన్నారు.

Minister Vishwaroop visited his destroyed house in amalapuram

అంబేడ్కర్ పేరు పెట్టాలని అన్ని పార్టీలు డిమాండ్ చేశాయని చెప్పారు. ఈ విధ్వంసంలో టీడీపీ, జనసేన పార్టీల ప్రమేయం ఉందన్నారు. కార్యకర్తలను కంట్రోల్‌ చేయడంలో టీడీపీ, జనసేన విఫలమయ్యింది.

ఈ ఘటనకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై చర్య తీసుకోవడం జరుగుతుందన్నారు. ఏ పార్టీ నాయకులు ఉన్న కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఎమ్మెల్యే సతీష్ ఇంటిమీద దాడి చేసినవారు.. పక్కనే ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఇంటి చేయలేదని.. ఇక్కడే దీని వెనక కారణాలు అర్థమవుతున్నాయని చెప్పారు

 

Related posts