ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రతన్జిత్ ప్రతాప్ నారాయణ్ (ఆర్పీఎన్) సింగ్.. కాంగ్రెస్కు గుడ్బై చెప్పారు.
ఈ క్రమంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రాజీనామా లేఖను పంపారు. ఈ నిర్ణయం వెంటనే అమలవుతుందని వివరించారు. ఈ దేశానికి, ప్రజలకు, పార్టీకి సేవలు అందించే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని తెలిపారు.
ఈ రాజీనామా లేఖను ట్విట్టర్లో పోస్టు చేస్తూ ఓ కామెంట్ చేశారు. ఈ రోజు ఈ సమయంలో అందరూ గణతంత్రం దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు, నేను నా రాజకీయ ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను. జై హింద్’ అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు.
మరోవైపు ఆయన.. భాజపాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్పీఎన్ సింగ్.. ఝార్ఖండ్లో కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆ రాష్ట్రంలో జేఎంఎంతో కలిసి అధికారంలో ఉంది కాంగ్రెస్.
ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన సన్నిహితులకు టికెట్ నిరాకరించడమే.. సింగ్ పార్టీని వీడేందుకు కారణమని సమాచారం. సింగ్.. యూపీ కుషీనగర్ నుంచి గతంలో ఎంపీగా సేవలందించారు.
యూపీలో ఆర్పీఎన్ సింగ్ను కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్గా చేసింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. అతను యూపీలోని పూర్వాంచల్లోని పద్రౌనా ప్రాంతానికి చెందిన నేత. కాంగ్రెస్ పార్టీలో దాదాపు 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నఆర్పీఎన్ సింగ్ కాంగ్రెస్ పార్టీని వీడడంతో చర్చానీయాంశమైంది.
యూపీ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు మొత్తం 7 దశల్లో జరగనున్నాయి. ఫిబ్రవరి 10న తొలి విడత పోలింగ్ జరగనుంది.మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.గౌతమ్.. రెండు సార్లు రాజ్యసభ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
Today, at a time, we are celebrating the formation of our great Republic, I begin a new chapter in my political journey. Jai Hind pic.twitter.com/O4jWyL0YDC
— RPN Singh (@SinghRPN) January 25, 2022