*దావోస్ బయలుదేరిన సీఎం జగన్
* రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దావోస్ పర్యటనకు బయలుదేరారు. పర్యటనలో భాగంగా ఈనెల 22వ తేదీ నుంచి 26 వరకూ దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్లో సీఎం జగన్తో పాటు మంత్రులు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుడివాడ అమర్ నాథ్, అధికారులు బృందం పాల్గొనున్నారు.
ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్ కేంద్రంగా జరిగే వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమ్మిట్లో సీఎం జగన్ పాల్గొంటారు. నాలుగో పారిశ్రామిక విప్లవంపై దావోస్ సమ్మిట్ లో సీఎం జగన్ కీలక ప్రసంగం చేయనున్నారు.
ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా సదస్సుకు 2200 మంది పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై సదస్సులో జగన్ వివరించనున్నారు.