telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మత్స్యకారులకు అండగా జనసేన అధినేత ప‌వ‌న్‌..

*రాజ‌మండ్రి నుంచి నర్సాపురానికి ర్యాలీగా బ‌య‌లుదేరిన ప‌వ‌న్‌
*మ‌త్య‌కారులు బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన‌నున్న ప‌వ‌న్‌
*భారీగా చేరుకున్న జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మత్స్యకారుల తరపున పోరాడేందుకు సిద్ధమయ్యారు. కాసేపట్లో నర్సాపురం వేదికగా మత్స్యకార బ‌హిరంగ స‌భ‌లో పాల్గోనున్న ఆయన.. ప్రభుత్వానికి అక్కడ నుంచే హెచ్చరిక జారీ చేయనున్నారు.

నర్సాపురం సభకు హాజరయ్యేందుకు ముందుగా హైదరాబాద్ లో బయలుదేరిన ఆయన రాజమండ్రికి చేరుకున్నారు.. దీంతో అక్కడ జనసైనికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

పవన్ ను చూసేందుకు భారీగా అభిమానులు, జనసేన కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. కాబోయే సీఎం పవన్ అంటూ ఫ్యాన్స్ హంగామా చేశారు. అభిమానుల ఆనందాల మధ్యే భారీ ర్యాలీతో నర్సాపురం బయలుదేరారు పవన్. పవన్ వస్తుండడంతో ఆ పార్టీ నేతలు సభకు భారీ ఏర్పాట్లు చేశారు.

Related posts