*ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
*మేడారం జాతరకు వెళ్లే మార్గంలో ఆర్టీసీ ఆర్టీసీ బస్సును ఢీ కొన్న కారు..నలుగురు మృతి
* మేడారం జాతరకు వెళ్ళి వస్తుండగా ఘటన..
ములుగులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, కారు ఢీ కొని ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ములుగు శివారులోని గట్టమ్మ ఆలయం మూల మలుపు వద్ద ఈ ప్రమాదం సంభవించింది.
కారులో భక్తులు మేడారం సమ్మక్క, సారలమ్మ దర్శనానికి వెళ్తుండగా.. ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మేడారానికి వెళ్లే మార్గంలో గట్టమ్మ ఆలయం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జవ్వగా.. మృతదేహాలు కారులో ఇరుక్కుపోయాయి. బస్సు ముందు భాగం కూడా కొంత దెబ్బతింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులువెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ములుగు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతులు శ్రీనివాస్, సుజాత, రమేష్, జ్యోతిగా గుర్తించిన పోలీసులు వారంతా ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మారం గ్రామస్తులుగా తెలిపారు. కళ్యాణ్ అనే వ్యక్తి పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.