బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్, అలియా భట్ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రహ్మస్త్ర’. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, డింపుల్ కపాడియా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా రణ్బీర్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘బ్రహ్మాస్త్ర’ చిత్ర దక్షిణాది మోషన్ పోస్టర్ను జక్కన్న విడుదల చేశారు.
ఈ సందర్బంగా రణ్బీర్ వేదికపైకి రాగానే రాజమౌళి కాళ్లు మొక్కడం హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రణ్బీర్ చూపిన వినయానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రపంచంలోనే తనకు అత్యంత ఇష్టమైన దర్శకుడు రాజమౌళి అని చెప్పారు రణ్బీర్ అన్నారు. దేశంలో ఆయనే నెం.1 అని కొనియాడారు. దక్షిణాదిలో ‘బ్రహ్మాస్త్ర సినిమాని రాజమౌళి ప్రెజెంట్ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.అమితాబ్ తర్వాత అతిపెద్ద నటుడు నాగార్జున. ఆయన కుటుంబంతో నాకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. ఆయనంటే నాకు ఎంతో ఇష్ట మని అన్నారు.
కాగా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ను వచ్చే ఏడాది సెప్టెంబర్9న విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను దక్షిణాది భాషల్లో రాజమౌళి సమర్పిస్తున్నాడు.