telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ట్రెండీ డ్రెస్‌లో అనసూయ… పిక్స్ వైరల్

Anasuya

యాంకర్ అనసూయ భరద్వాజ్ మళ్లీ వరుస షోలతో బిజీ అయిపోయారు. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌తో మూడు నెలలపాటు ఖాళీగా ఇంట్లోనే ఉన్న అనసూయ.. మళ్లీ ఇప్పుడు ‘జబర్దస్త్’, ‘ప్రతిరోజూ పండగే’ షోలతో బిజీగా ఉన్నారు. ఇదిలా తాజాగా అనసూయ ఓ ఫొటోషూట్‌ కు సంబంధించిన పిక్స్ ను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ బ్యూటిఫుల్ పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. చిట్టిపొట్టి బట్టల్లో అనసూయ మెరిసిపోతున్నారు. ట్రెండీ డ్రెస్‌లో అందాలను ఆరబోస్తూ అనసూయ పోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలో ఇన్‌స్టాగ్రామ్‌లో హీట్‌ను పెంచేస్తున్నాయి. ఓ వైపు టీవీ షోలతో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నారు అనసూయ. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ ‘పుష్ప’, కృష్ణవంశీ ‘రంగమార్తాండ’, చిరంజీవి ‘ఆచార్య’లో నటిస్తున్నారు.

Related posts