యాంకర్ అనసూయ భరద్వాజ్ మళ్లీ వరుస షోలతో బిజీ అయిపోయారు. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన లాక్డౌన్తో మూడు నెలలపాటు ఖాళీగా ఇంట్లోనే ఉన్న అనసూయ.. మళ్లీ ఇప్పుడు ‘జబర్దస్త్’, ‘ప్రతిరోజూ పండగే’ షోలతో బిజీగా ఉన్నారు. ఇదిలా తాజాగా అనసూయ ఓ ఫొటోషూట్ కు సంబంధించిన పిక్స్ ను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ బ్యూటిఫుల్ పిక్స్ను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. చిట్టిపొట్టి బట్టల్లో అనసూయ మెరిసిపోతున్నారు. ట్రెండీ డ్రెస్లో అందాలను ఆరబోస్తూ అనసూయ పోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలో ఇన్స్టాగ్రామ్లో హీట్ను పెంచేస్తున్నాయి. ఓ వైపు టీవీ షోలతో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నారు అనసూయ. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ ‘పుష్ప’, కృష్ణవంశీ ‘రంగమార్తాండ’, చిరంజీవి ‘ఆచార్య’లో నటిస్తున్నారు.