మన దేశంలో కరోనా కు ఈ ఏడాది ఆరంభం నుండి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం రోజురోజుకు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ముంబైలో కరోనా విలయ తాండవం చేస్తోంది. దీంతో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించే ముంబై వాంఖడే స్టేడియం సిబ్బంది, కొంతమంది ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఈ ఏడాది ఐపీఎల్ నిర్శహిస్తారా? లేదా?అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఐతే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఐపీఎల్ ఫ్యాన్స్కి గుడ్న్యూస్ చెప్పాడు. షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్లు నిర్వహిస్తామని తెలిపాడు. ఐపీఎల్ 2021 సీజన్ ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ జరుగనుంది. ముంబయిలో ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్రైడర్స్ తమ క్యాంప్లను ఏర్పాటు చేశాయి. ఇందులో ముంబయి, కోల్కతా జట్లు త్వరలోనే క్యాంప్ని చెన్నైకి మార్చనుండగా.. మిగిలిన జట్లు అక్కడే వాంఖడే స్టేడియంలో మ్యాచ్ ఆడనున్నాయి.
previous post
next post