telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పట్టభద్రులు ఓటును సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి సబిత

Sabitha indrareddy

తెలంగాణలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29తో ముగియనుంది. ఈ లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తిచేసేందుకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. కొత్త ఓటర్ల నమోదు కోసం అక్టోబరు 1న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఆమె మాట్లాడుతూ పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ఉత్సాహవంతంగా నిర్వహించాలని కోఆర్డినేటర్లకు పిలుపునిచ్చారు. 2017కి ముందు డిగ్రీ పూర్తయిన ప్రతిఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఏ డిగ్రీ పాసైన వారైనా ఓటరుగా నమోదుకు అర్హులని స్పష్టం చేశారు.

Related posts