ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి మాట్లాడుతూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను దూషించారంటూ వైసీపీ నేత చేసిన ఫిర్యాదుతో విశాఖ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు, టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబును ఎంవీపీ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నేత అక్కరమాని విజయనిర్మల, గత నెల 25న పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ద్వారకా జోన్ ఏసీపీ వైసీ నాయుడు, సీఐ లక్ష్మోజీలు విచారణ జరిపి, కేసు రిజిస్టర్ చేశారు. ఈ కేసులో స్టేషన్ కు వచ్చి బెయిల్ తీసుకుని వెళ్లాల్సిందేనని పోలీసులు స్పష్టం చేయడంతో రామకృష్ణ పోలీసుల ఎదుట హాజరయ్యారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా వెలగపూడి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ కక్ష సాధింపు చర్యలు మొదలు పెట్టిందని ఆరోపించారు.
రాజధానిని ఇడుపులపాయకు తరలించేందుకు ప్రయత్నాలు: దేవినేని