దేశంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఎన్ని రూల్స్ పెట్టినప్పటికీ… రోడ్డు ప్రమాదాలు తగ్గటం లేదు. పరిమితి మించి వేగంగా వెళ్లడం కారణంగా ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాహనంలోని ముందు సీట్లలో ఎయిర్ బ్యాగ్ను తప్పనిసరి చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి తయారయ్యే వాహనాలు తప్పనిసరిగా ఈ నిబంధనలు పాటించాలని ఆదేశించింది. వినియోగంలో ఉన్న వాహనాల్లో ఆగస్టు 31 నాటికి ఎయిర్ బ్యాగ్లను అమర్చుకోవాలని పేర్కొంది. రహదారి భద్రతకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది కేంద్రం. కాగా దేశంలో ప్రయాణికుల భద్రతా విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోమని, రాష్ట్రాలు రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఇటీవల అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.
previous post
టీఆర్ఎస్ ట్రిక్స్కు మోసపోయే వారెవరు లేరు: విజయశాంతి