telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ముత్తూట్ ఫైనాన్స్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్…

ముత్తూట్‌ ఫైనాన్స్‌ కష్టమర్లకు ఊహించని షాక్‌ తగిలింది. ముత్తూట్‌ గ్రూప్‌ చైర్మన్‌ ఎంజీ జార్జ్‌ మృతి చెందారు. ముత్తూట్‌ కుటుంబంలో ఆయన మూడోతరానికి చెందిన బిజినెస్‌ మ్యాన్‌. ప్రస్తుతం ఆయన ముత్తూట్‌ గ్రూప్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన పూర్తి పేరు మత్తయ్య జార్జ్‌ ముత్తూట్‌. ఆయన సారథ్యంలో ముత్తూట్‌ ఫైనాన్స్‌ దేశంలోనే గోల్డ్‌లోన్‌ ఇచ్చే అతిపెద్ద సంస్థగా అభివృద్ధి చెందింది. ఈయన 1979లో ముత్తూట్‌ ఎండీగా ఎన్నికయ్యారు. 1993 నుంచి ముత్తూట్‌ చైర్మన్‌గా వ్యవహరించారు. కేరళలోని కొచ్చి ప్రధాన కార్యాలయంగా ముత్తూట్‌ కార్యకలాపాలు కొనసాగుతుంటాయి. ముత్తూట్‌ ఫైనాన్స్‌కు దేశవ్యాప్తంగా పలు శాఖలున్నాయి. వాటిలో కొన్ని లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు. కాగా.. ఫోర్బ్స్‌ ఆసియా మేగజైన్‌.. ఎంజీ జార్జ్‌ ముత్తూట్‌కు 2011లో దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో 50వ స్థానం కల్పించింది. 2019 నాటికి జార్జ్‌ ముత్తూట్‌ 44వ స్థానానికి చేరుకున్నారు.

Related posts