వైఎస్ షర్మిల పార్టీ పెడతారనే వార్తలు రాగానే.. తెలంగాణలోని అన్ని పార్టీలు తీవ్రస్థాయిలో స్పందించాయి. ఏపీ పార్టీ తెలంగాణలో అవసరమా.. ఫ్యాక్షన్ రాజకీయాలు ఇక్కడ రుద్దుతారా అని తెలంగాణ లోని అన్ని పార్టీలు మండిపడ్డాయి. అయితే.. తాజాగా దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ కుట్రలో భాగంగానే షర్మిల పార్టీ పెట్టనుందని వీహెచ్ అన్నారు. షర్మిల పార్టీతో ఓట్లు చీల్చి లబ్ది పొందాలని బీజేపీ పార్టీ భావిస్తోందన్నారు. అటు జగన్కు, షర్మిలకు విభేధాలున్నాయని చెప్పిన వీహెచ్.. జగన్పై కోపం ఉంటే ఏపీలో పార్టీ పెట్టాలని సూచించారు. ప్రస్తుతం ఆమెకు ఓ సామాజిక వర్గం సపోర్ట్ చేసే అవకాశం ఉందన్నారు. వ్యతిరేక ఓటు చీలితే కేసీఆర్కు లాభం జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ నుంచి ఎవరూ షర్మిల పార్టీలో చేరరని స్పష్టం చేశారు వీహెచ్. త్వరలోనే షర్మిల వెనుక ఎవరున్నారో బయటపడుతుందని పేర్కొన్నారు వి. హనుమంతరావు.
previous post