telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆ భయంతోనే 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

soyam bapu rao

బీజేపీ ఎంపీ సోయం బాపురావు సీఎం కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. జీహెచ్ఎంసి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓటమి తర్వాత బీజేపీ పుంజుకుంటోందని… ఇది సహించలేకపోయిన సీఎం కేసిఆర్ అయోమయం సృష్టించడం కోసం ఢిల్లీ పర్యటన చేపట్టారని ఫైర్ అయ్యారు. ఒకవేళ అధికారికంగా సీఎం హోదాలో కలిస్తే అధికారులను వెంటబెట్టుకుని వెళ్ళాలని… కానీ అలా జరగలేదంటే, ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆయన అవినీతి బయటపడుతుందన్న భయంతోనే ఈ రకంగా వ్యవహరిస్తున్నారని… నిన్న మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇదే విషయం లేవనెత్తారని పేర్కొన్నారు. వాటికి సమాధానం చెప్పకుండా, బండి సంజయ్ మీద వేరే వాళ్ళతో ఆరోపణలు చేయిస్తున్నారని… నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అన్న నినాదం సొంత కుటుంబానికే దక్కాయి తప్ప మరొకరికి రాలేదని తెలిపారు.
నిరుద్యోగులు ఈ విషయం గ్రహించి ఆగ్రహంతో ఉన్నారని.. అందుకే 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారని వెల్లడించారు. రిటైర్ అయిన ఉద్యోగుల కారణంగా ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయాలని… మొత్తం 1.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నానని పేర్కొన్నారు. ఆదివాసీలు పొడు వ్యవసాయం చేసుకునే భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి మోసగించారని… ఎన్నికల్లో గెలిచిన తర్వాత అది కేంద్ర పరిధిలోకి వస్తుందని, రాష్ట్ర పరిధిలో లేదని కేసిఆర్ వితండవాదం చేస్తున్నారని మండిపడ్డారు. మరి పక్క రాష్ట్రం ఆంధ్రాలో సీఎం జగన్ ఎలా పట్టాలు ఇచ్చారో గ్రహించాలని చురకలు అంటించారు.

Related posts