telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పారితోషికం తగ్గించుకుంటున్న డైరెక్టర్ కొరటాల శివ

Koratala

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా సినిమా, రాజకీయ, క్రికెట్.. ఎడ్యుకేషన్ ఇలా అన్ని రంగాలకు సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటు ప్రజలతో పాటు అటు ఎంతోమంది సెలెబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. మరోవైపు కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ లు నిలిచిపోయాయి, థియేటర్స్ మూతపడ్డాయి, రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాలు సైతం థియేటర్స్ లేక ఆగిపోయాయి. మరి కొన్ని సినిమాలు ఆర్థిక ఇబ్బందులతో ఓటిటిలో రిలీజ్ అవుతున్నాయి. నిర్మాతలు ఎదురుకుంటున్న ఇబ్బందుల దృష్ట్యా స్టార్ హీరో, హీరోయిన్ లు తమ రెమ్యునరేషన్ ను తగ్గించుకుంటున్నారు. తాజాగా కొరటాల శివ స్వచ్ఛందంగా తన వేతనం తగ్గించాలని నిర్మాతలను కోరారు. కొరటాల ప్రస్తుతం మెగాస్టార్ తో ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు తన రెమ్యునరేషన్ తగ్గించాలని కొరటాల నిర్మాతలను కోరారట. ఈ చిత్ర నిర్మాతలు నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ త్వరలో ఈ విషయం పై క్లారిటీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

Related posts