telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బంగారు తెలంగాణ… బెదిరింపుల తెలంగాణగా మారింది : కోమటిరెడ్డి

టీఆర్‌ఎస్‌ పార్టీపై కాంగ్రెస్‌ ఎంపీ కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మాన‌కొండూర్ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఆడియో కాల్ రికార్డు బయటపడిన విషయం తెలిసిందే. ఆ ఆడియోతో పెద్ద వివాదమే రాజుకుంది. అయితే.. తాజాగా ఈ ఆడియోపై కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. “ఎంతో మంది ప్రాణాలు ప‌ణంగా పెట్టి తెచ్చుకున్న‌ బంగారు తెలంగాణ… టీఆర్ఎస్ పాల‌న‌లో బెదిరింపుల తెలంగాణగా మారింది. అభివృద్ధిపై నిల‌దీసిన యువ‌త‌పై దిట్ల దండ‌కం కురింపించే తెలంగాణ త‌యార‌య్యింది. ఏం ర‌స‌మ‌యి.. మాన‌కొండూర్ నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్య‌ల‌పై నిల‌దీసిన కాంగ్రెస్ కార్య‌కర్త‌ల‌ను బెదిరించే స్థాయికి ఎదిగిన‌వా…? నీ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లకు నిన్ను ప్ర‌శ్నించే హ‌క్కులేదా..? తెలంగాణ కోసం గొంతెత్తిన డ‌బ్బా కొట్టుకునే నువ్వే.. యువ‌తను ఇష్టానుసారం తిడుతావా…? బిడ్డ‌ నీ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జలు చీద‌రించుకునే రోజులు ద‌గ్గ‌ర‌బ‌డ్డాయి. మ‌ళ్లీ కాంగ్రెస్ కార్య‌కర్త‌ల‌పై బెదిరింపుల‌కు పాల్ప‌డితే చూస్తు ఊరుకోము. ఖ‌బ‌ర్ధార్…” అంటూ కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు.

Related posts