ఏపీ పంచాయతీ ఎన్నికల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ చాలా దూకుడుగా వెళుతున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్, వైసీపీగా ఏపీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వానికి ఊపిరి పీల్చుకోకుండా చేస్తున్న నిమ్మగడ్డ తాజాగా చంద్రబాబు నాయుడికే షాక్ ఇచ్చారు. టీడీపీకి నోటీసులు జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. గ్రామ పంచాయతీ ఎన్నికలకు టిడిపి మేనిఫెస్టో విడుదల చేయడంపై ఎస్ఈసీ కి ఫిర్యాదు చేసింది వైసిపి. అయితే.. వైసిపి ఫిర్యాదుపై నోటీసులు జారీ చేసారు నిమ్మగడ్డ నిమ్మగడ్డ. ఫిబ్రవరి రెండో తేదీ లోపు వివరణ ఇవ్వాలని కోరారు నిమ్మగడ్డ. పార్టీలకు రహితంగా జరిగే ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని… వైసిపి ఫిర్యాదు చేసిందని నోటీసులో పేర్కొన్నారు నిమ్మగడ్డ. వివరణ ఇవ్వని పక్షంలో తగిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసారు నిమ్మగడ్డ రమేష్ కుమార్.
previous post

