కులాలు మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబు ఒక్కడికే తెలుసని… ఏపీలో జరుగుతున్న విధ్వంసానికి చంద్రబాబే కారణం మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఏపీ దేవాలయాలపై జరిగిన దాడులపై ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. క్షుద్రపూజలు చేసిన చరిత్ర ఎవరికీ ఉంది..? విజయవాడలో 40 గుళ్లను కూలగొట్టింది ఎవరు..? అని చంద్రబాబును నిలదీశారు మంత్రి అనిల్. దేవాలయాలపై, విగ్రహాలపై జరుగుతున్న దాడులపై డీజీపీ సవాంగ్ స్పష్టంగా వివరణ ఇచ్చారన్నారు. ఇందులో టీడీపీ హస్తం ఉందనే నిజం ఎక్కడ బయటపడుతుందో అనే భయం వారిలో కనిపించిందన్నారు. ఒక్కసారిగా అందరూ బెంబేలెత్తారని.. గుంపులు, గుంపులుగా ఏదేదో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కులాలు మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబు ఒక్కడికే తెలుసని మంత్రి అనిల్ విమర్శించారు. విగ్రహాలు పగులగొట్టినా పర్లేదు కానీ నిజాలు బయటకు రాకూడదని టీడీపీ నేతలు ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు మంత్రి అనిల్.
previous post