telugu navyamedia
రాజకీయ వార్తలు

బాలీవుడ్ మాఫియాకు కాంగ్రెస్ అండ: సుశీల్ మోదీ

susheel modi

సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుపై బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ స్పందించారు. సుశాంత్ కేసును కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. నిందితులకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కొమ్ముకాస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అండదండలతోనే ఇదంతా జరుగుతోందన్నారు.

కాంగ్రెస్ నేతలు బీహార్ ప్రజలకు ఇకపై ముఖం ఎలా చూపించుకుంటారని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.బాలీవుడ్ మాఫియాకు కాంగ్రెస్ పూర్తి అండగా ఉంటోందని ఆరోపించారు. ఆ పార్టీ ఒత్తిడి వల్లే నిందితులకు ఉద్ధవ్ థాకరే అండగా నిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రియాచక్రవర్తిపై సుశాంత్ తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు ముంబై వెళ్లిన బీహార్ పోలీసులకు అక్కడ సహకారం లభించలేదని ఆరోపించారు.

Related posts