ఏ ముఖం పెట్టుకుని ప్రధాని మోదీ ఏపీలో అడుగుపెడతారని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. అమరావతిలోని అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే ఏపీలో మోదీ అడుగుపెట్టాలని అన్నారు. ప్రధాని మోదీ ఏం చేశారని.. ఏపీకి వస్తారని ప్రశ్నించారు.
మోదీ, అమిత్ షాలు ఏపీలో అడుగుపెడితే… మట్టికుండలు, నీళ్లతో ఏపీ ప్రజలు వారి ముఖాన కొడతారని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో తొలిసారి గళం విప్పింది టీడీపీనే అని అన్నారు. కేంద్ర మంత్రి పదవులను సైతం వదులుకుని ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని చెప్పారు. బీజేపీపై రాజీలేని పోరాటం చేస్తున్నామని తెలిపారు. నాలుగు బడ్జెట్లు వేచి చూసినా.. ప్రయోజనం లేదన్నారు. వైసీపీకి బీజేపీతో లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు. ప్రజలకు కూడా ఈ విషయం అర్థమైందన్నారు.
తెలంగాణకు రాబడి తక్కువ… అప్పులు ఎక్కువ: భట్టి విక్రమార్క