కేజియఫ్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత ప్రముఖ స్టార్ల దృష్టి దర్శకుడు ప్రశాంత్నీల్పై పడింది. ప్రశాంత్నీల్ చేయబోయే ప్రాజెక్టులో కలిసి వర్క్ చేయాలని టాలీవుడ్ స్టార్లు తహతహలాడుతున్నారు. ఇటీవలే దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ను కలిసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచే వారిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రానుందని అభిమానులు పక్కాగా డిసైడ్ అయ్యారు.ఈ మేరకు కేజీఎఫ్ సినిమా తెరకెక్కించిన హోంబలే ఫిల్మ్స్ సంస్థ ట్విట్టర్లో కెజియఫ్ దర్శకుడు ప్రశాంత్నీల్ తో ప్రభాస్ సినిమాకు సంబందించిన పోస్టర్ ను విడుదల చేసింది. ‘ది మోస్ట్ వాలైంట్ మెన్.. కాల్డ్ వన్ మెన్.. ది మోస్ట్ వాలైంట్’ అంటూ ప్రభాస్ గూర్చి తెలియజేస్తూ “సాలార్” టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. టైటిల్ ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక వార్త ఈ సినిమాపై వైరల్ అవుతూనే ఉంది. తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి ఉన్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది చిత్ర యూనిట్. సలార్ సినిమాలో నటించాలని ఆశగా ఉన్నవారు అందరూ డిసెంబర్ 15న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శేరిలింగంపల్లిలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. వయసుతో సంబంధం లేదని కూడా పేర్కొంది ఈ సినిమా యూనిట్. త్వరలోనే బెంగళూరు, చైన్నైలలో కూడా ఆడిషన్స్ నిర్వహిస్తామని వెల్లడించారు.
previous post
నామీద నాకే అసహ్యం వేసింది : విద్యాబాలన్