బాలీవుడ్ సినీ పరిశ్రమలో డ్రగ్స్ కేసు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. డ్రగ్స్ కేసులో మరో బుల్లితెర నటుడు పట్టుబడ్డాడు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో హిందీ బుల్లి తెర నటుడు గౌరవ్ దీక్షిత్ను శుక్రవారం అరెస్టు చేశారు.
డ్రగ్స్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు .. హిందీ బిగ్బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ ఎజాజ్ ఖాన్ను అరెస్ట్ చేశారు. ఎజాజ్ ఖాన్.. తెలుగులో రక్త చరిత్ర, నాయక్ వంటి సినిమాల్లో విలన్గా నటించాడు. ఈ విచారణలో భాగంగా గౌరవ్ దీక్షిత్ పేరును అజాజ్ బయటపెట్టాడు. దీంతో అతడికి లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది.
అంతకుముందు ముంబయికి చెందిన గౌరవ్ దీక్షిత్ నివాసంలో సోదాలు చేసిన అధికారులు.. భారీ ఎత్తున నిషేధిత మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకోవడం సహా అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఎన్సీబీ శుక్రవారం వెల్లడించింది.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత విచారణ ప్రారంభించిన ఎన్సీబీ, పలువురిని విచారించింది. అప్పటి నుంచి డ్రగ్స్ కేసులో ఎందరో బాలీవుడ్ నటీనటులు పేర్లు తెరపైకి వస్తున్నాయి. జాబితాలో దీపికా పదుకొనే, అర్జున్ రామ్ పాల్, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ వంటి వారు చాలా మంది ఉన్నారన్న సంగతి తెలిసిందే. మొత్తానికి డ్రగ్స్ కలకలం బాలీవుడ్ను తెగ ఊపేస్తుంది.
యురేనియం తవ్వకాలపై విజయ్ దేవరకొండ స్పందన ?