హీరో నితిన్, షాలిని కందుకూరి వివాహం ఈనెల 26న హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక ఫలక్నుమా ప్యాలెస్లో జరగనుంది. వధూవరుల ఇంట ఇప్పటికే పెళ్లి సందడి మొదలైపోయింది. బుధవారం నితిన్, షాలిని నిశ్చితార్థ వేడుకను నిర్వహించగా… గురువారం మెహందీ ఫంక్షన్ను సందడిగా నిర్వహించారు. నిశ్చితార్థ వేడుకకు సంబంధించి షాలినీకి ఉంగరం తొడుగుతున్న ఫొటోను ఇప్పటికే నితిన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అయితే, మెహందీ ఫంక్షన్ ఫొటోలను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీరజ కోన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లో నితిన్ నీలం రంగు కుర్తాలో మెరిసిపోతుండగా.. షాలిని ఎరుపు రంగు లెహెంగా వేసుకుని, డైమండ్ నెక్లేస్ ధరించి దేవతలా కనిపిస్తున్నారు. షాలినీతో తీసుకున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన నీరజ కోన.. మిగిలిన ఫొటోలను తన ఇన్స్టా స్టోరీలో పెట్టుకున్నారు. కాగా, ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనలు అమలులో ఉండటంతో పెళ్లి వేడుకను చాలా తక్కువ మంది అతిథుల సమక్షంలో జరపనున్నారు. కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, కొంత మంది స్నేహితులు మాత్రమే నితిన్-షాలిని పెళ్లికి హాజరుకానున్నారు.
.@NeerajaKona shares the pictures from the Mehendi ceremony of #NithiinShalini @actor_nithiin pic.twitter.com/BJwpqhrRqg
— BARaju (@baraju_SuperHit) July 24, 2020