ఈనెల 2 నుంచి 12వ తేదీ వరకు జరిగే వినాయక నిమజ్జన కార్యక్రమానికి జీహెచ్ఎంసీ ప్రత్యేక కొలనులను సిద్ధం చేస్తున్నది. నిమజ్జనానికి చెరువుల వద్ద ప్రత్యేక కొలనులను జీహెచ్ఎంసీ నిర్మిస్తున్నది. ఇప్పటి వరకు ఆయా ప్రాంతాల్లో 23 కొలనులను సిద్ధం చేయగా, మరో మూడు కొలనుల నిర్మాణం పురోగతిలో ఉన్నది. ఇవికూడా నిమజ్జన సమయానికి సిద్ధమవుతాయని అధికారులు భరోసా ఇస్తున్నారు.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోపాటు ప్రమాదకర రసాయనాలతో చెరువులు కలుషితం కాకుండా ఉండేందుకు బెంగళూరు తరహాలో నగరంలో కూడా చెరువుల వద్ద కొలనుల నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ చేపట్టింది. దీనిలో భాగంగా మొదటి దశలో రూ.6.95 కోట్లతో పది, రూ.14.94 కోట్లతో 15 కొలనుల నిర్మాణం చేపట్టారు. తాజాగా మల్కాజిగిరిలో బండచెరువులో రూ.ఒక కోటి వ్యయంతో మరో కొలను నిర్మాణాన్ని చేపట్టారు. దీనితో ఇప్పటి వరకు 23 పూర్తయ్యాయి.