సీనియర్ నటుడు..దీవి.దీక్షిత్ మృతి..
మురారి చిత్రం లో పూజారి పాత్రలో అలరించిన..దీక్షిత్ ఇక లేరు. నేడు ఒక సినిమా షూటింగ్ లో ఉండగా, హటాత్తుగా గుండె నొప్పితో బాధపడుతున్న ఆయనను..హుటాహుటిన నాఛరమఁ ఆసుపత్రికి తరలించారు. వెంటనే పరీక్షించిన వైద్యులు..అప్పటికే ఆయన మృతి చెందినట్టు వెల్లడించారు.
నాటక రంగం మొదలు..నేటి వరకు ఆయన నటనతో ప్రేక్షకులను కట్టి పడేసిన సందర్భాలు ఎన్నో.. అలాంటి నటుడు లేడు అనే వార్తను తోటి నటీనటులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయినా ఇటివల సినీ నటులు ఎంతో మంది మృతి చెందటం, టాలీవుడ్ కు తీరని లోటు అని విశ్లేషకులు అంటున్నారు.
దీవి.దీక్షితులు మురారి, ఇంద్ర, ఠాగూర్, అతడు, వర్షం వంటి ఉత్తమ చిత్రాలలో నటించి..ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. టాలీవుడ్ సహా పలు రంగస్థల నటులు దీక్షిత్ మృతి పట్ల ప్రగాడ సానుభూతి తెలిపారు.
నానిపై మరోసారి శ్రీరెడ్డి కామెంట్స్