ఆందోల్ ఎమ్మెల్యేపై బీజేపీ నేత బాబుమోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆందోల్ ఎమ్మెల్యే తనపై దుష్ప్రచారం చేస్తున్నాడని.. దానిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆందోల్ ఎమ్మెల్యే కి ఎన్ని డిగ్రీలు ఉన్నాయో తనకు తెలియదని.. సంస్కరహీనంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలను మోసం చేసింది ఎవరు.. మోడీనా, కేసీఆరా అంటూ ప్రశ్నించారు. సిగ్గుండాల్సింది ఎవరికి.. సీఎంకి, ఆందోల్ ఎమ్మెల్యేకి అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నియోజక వర్గం గురించి చర్చించేందుకు తాను సిద్ధమని.. నువ్వేమి చేశావు, తానేమి చేసాను దానిపై చర్చ పెడుదామని సవాల్ విసిరారు. లంచాలు నువు ఎందరి దగ్గర తీసుకున్నావ్.. తాను ఎందరి దగ్గర తీసుకున్న విషయంపై చర్చకు సిద్ధమన్నారు. ఆందోల్ మండలంలో చెరువు శిఖం కబ్జా పెట్టాడని..అతని సొంతూరు లో కూడా కబ్జా చేశాడని ఫైర్ అయ్యారు.
ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కి సినీ పరిశ్రమకు ఏమి సంబంధం.. ఏ విభాగం లో పనిచేశావు..చిత్రపురి కాలనీ లో నీకు ఇల్లు ఎలా ఉంది.. ఎలా వచ్చింది అని ప్రశ్నించారు. దమ్ముంటే రాజీనామా చేయి.. ప్రజల్లో తేల్చుకుందామని స్పష్టం చేశారు. కేసీఆర్ ట్రైనింగ్ ఇస్తున్నాడా…Trs ఎమ్మెల్యే లు బరితెగించి మాట్లాడుతున్నారు, తిరుగులేదని భావిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
previous post