*తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
*నలుగురు మృతి 10 మందికి గాయాలు,
*మృతులు షూ కంపెనీ కార్మికులుగా గుర్తింపు..
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, లారీ- వ్యాన్ ఢీకొని నలుగురు మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతూర్ అంబూర్-వేలూరు హైవేపై లారీ, వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 6గురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
మృతులు షూ కంపెనీ కార్మికులుగా గుర్తించారు.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.