telugu navyamedia
క్రైమ్ వార్తలు

పిల్ల‌ల్ని చిత్ర హింసలు పెట్టిన తల్లి అరెస్ట్…

పేగు తెంచుకుని పుట్టిన పిల్లలను హింసించి రాక్షసానందం పొందుతున్న మహిళను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు లోని విల్లుపురం జిల్లా మనలప్పాడి మధురమేట్టూర్‌ గ్రామానికి చెందిన వడివళగన్‌, చిత్తూరు జిల్లా రాంపల్లికి చెందిన తులసిని కొన్నేళ్ల కిందట పెళ్ళి చేసుకున్నాడు. వీరికి గోకుల్ (4), ప్రదీప్ (2) కుమారులు ఉన్నారు. ఐతే కొన్ని రోజులుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య గుట్టును భర్త రట్టు చేయటంతో ఆమెలోని రాక్షసత్వం బయటపడింది. పుట్టిన పిల్లలన్న కనికరం కూడా లేకుండా వారిని తీవ్రంగా హింసించింది. ఇద్దరు పిల్లలపై ఆమె కూర్రతాన్ని వీడియోలు కూడా తీసింది. ఈ వీడియోలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

అమ్మతనానికి మాయని మచ్చగా ఆమె ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియోల ఆధారంగా భర్త తన భార్య తులసిపై కేసు పెట్టాడు. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ఈ తల్లి పిల్లలను కొట్టిన వీడియోలు చూసి చలించిపోయారు. ఆమెను అరెస్ట్ చేయాలంటూ పోలీసులను ఆదేశించారు. తమిళనాడు లోని వడివళగన్ కు చిత్తూరు జిల్లా రాంపల్లికి చెందిన తులసికి పెళ్లైంది.

Tamil Nadu Woman Arrested After Videos Show Her Torturing Her 2-Year-Old

విహేతర సంబంధం కారణంగా వడివళగన్ ఆమెను వ‌దిలేయ‌డంతో కొన్ని రోజులుగా చిత్తూరు జిల్లాలోని రాంపల్లిలో ఉంటోంది. భర్తపై కోపంతో ఈ క్రమంలో తన బిడ్డ ప్రదీప్‌ను తీవ్రంగా కొట్టి దానిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. ఆ వీడియోలను తమిళనాడులోని సత్యమంగళం పోలీసులకు అందజేసిన భర్త తన భార్యను అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఏపీలో ఉన్న ఆమెను అరెస్ట్ చేశారు.

Related posts