telugu navyamedia
క్రైమ్ వార్తలు

బంజారాహిల్స్‌లో కారు బీభత్సం..ఇద్ద‌రు మృతి..

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ సోమవారం, డిసెంబర్ 6, 2021 తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. పుల్‌గా తాగి ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో అమాయ‌క ప్ర‌జ‌లు బ‌లైవుతున్నారు. ఈ మ‌ధ్య కాలంలో డ్రంగ్ యండ్ డ్రైవ్ కేసులు ఎక్కువైయ్యాయి. పోలీసులు ఎంత వారిస్తున్న జ‌నాలు పెడ‌చెవిన పెడుతున్నారు.

వివ‌ర్లాలోకి వెళితే..

రోహిత్‌ అనే వ్యక్తి మ‌ద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ హ‌ల్ చ‌ల్ సృష్టించ‌డంతో .. రోడ్డు దాటుతున్న ఇద్దరు యువకులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మృతులు త్రిభువన్‌(23), ఉపేందర్‌(25)లుగా పోలీసులు గుర్తించారు.

స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రోహిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే త్రిభువన్‌రాయ్‌ రెయిన్‌బో ఆసుపత్రిలో ఆఫీస్‌ బాయ్‌ గా పనిచేస్తుండగా, ఉపేందర్‌ కుమార్‌ దాస్‌ అసిస్టెంట్‌ కుక్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Related posts