ఓ మహిళ ఫోన్లో మాట్లాడుతున్న బిజీలో చుట్టుపక్కకు చూసుకోకుండా ఏకంగా పాముల మీద కూర్చుంది. దీంతో పాము కాటు వేయడంతో ఆమె మృతి చెందింది. ఈ సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ గోరక్పూర్లో చోటు చేసుకుంది. రివాయ్ గ్రామానికి చెందిన జయసింగ్ థాయ్ల్యాండ్లో ఉంటాడు.
అక్కడి నుంచి ఆయన తన భార్య గీతకు ఫోన్ చేశాడు. భర్తతో ఫోనులో మాట్లాడుతూ పక్కనే ఉన్న మంచంపై కూర్చుంది గీత. అయితే అప్పటికే ఆ మంచంపై రెండు పాములున్నాయి. ఆమె చూసుకోకుండా వాటిపైననే కూర్చుంది. దీంతో ఒక పాము ఆమెను కాటువేసింది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.