telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

హైదరాబాద్ : .. గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న .. ప్రవచనకర్త బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వరరావు గారు..

brahmma sri chaganti koteswararao green challenge

సామజిక మాధ్యమాలలో విస్తరించిన గ్రీన్ ఛాలెంజ్ లో ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వరరావు గారు పాల్గొని మూడు మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠాగోపాల్, రాఘవ, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కోటేశ్వరరావు మాట్లాడుతూ… చెట్లు పక్షులకు, ఇతర జీవరాసులకు ఆవాసం కావడంతో పాటు కంటికి ఎంతో సంతోషాన్ని కలిగించి మానసికోల్లాసం కల్పించేవి ఈ చెట్లు.

మొక్కలు నాటండి, మరో ముగ్గురితో నాటమని చెప్పండని స్పూర్తితో సాగుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమం ఎంతో మహోన్నతమైది. ఈ ఉద్యమంతో భూగోళంపై ఉండే సమస్త జాతులకు మేలు జరుగుతుంది. జాతీయ సమైఖ్యతకు స్పూర్తి ఈ మొక్కలు నాటడం అని కొనియాడారు. అంతగొప్ప ఉద్యమం నిర్వహిస్తున్న వారికి అభినందనలు తెలిపారు.

Related posts