*వినాయక విగ్రహలు చుట్టూ ఏపీ రాజకీయం
* పందిళ్ళకు విద్యుత్ ఖర్చులు పెరిగాయంటూ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు
*మండపాలకు అనుమతి తప్పసరి అంటున్న పోలీసులు
ఏపీలో గణేష్ ఉత్సవాలపై విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నిబంధనలు, రుసుముల పేరుతో గణేష్ ఉత్సవ కమిటీలను వేధిస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
అయితే వినాయక చవితి ఉత్సవాల పందిళ్ళకు విద్యుత్ ఖర్చులు పెరిగాయంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు, భక్తులకు, నిర్వహకులకు విద్యుత్ శాఖ విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ తూర్పు, దక్షిణ, మధ్య ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థల సీఎండీలు కే సంతోషరావు, జే పద్మాజనార్థన రెడ్డి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే వినాయక మండపాలకు తాత్కాలిక విద్యుత్ టారిఫ్ ను పెంచలేదని, పైగా గతంలో 250 వాట్స్ కి కూడా రూ.1000 తీసుకునేవారని, కానీ ఇప్పుడు రూ.750 గా నిర్ణయించామన్నారు.
అప్పట్నుంచీ అవే చార్జీలు..
రాష్ట్రవ్యాప్తంగా వినాయక మండపాలకు 2014 నుంచి అమలులో ఉన్న టారిఫ్ ప్రకారం 500 వాట్స్ కి రూ.1000, 1000 వాట్స్ కి రూ.2250, 1500 వాట్స్ కి రూ.3,000, 2000 వాట్స్ కి రూ.3,750, 2500 వాట్స్ కి రూ.4,550, 3000 వాట్స్ కి రూ.5,250, 3,500 వాట్స్ కి రూ.6,000, 4000 వాట్స్ కి రూ.6,750, 5000 వాట్స్ కి రూ.8,250, 6000 వాట్స్ కి రూ.9750, 10000 వాట్స్ కి రూ.15750 చొప్పున చెల్లించి తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లను తీసుకోవాలని సూచించారు. విద్యుత్ శాఖ నిబంధనల మేరకు ఈ కనెక్షన్ల ద్వారా పది రోజులపాటు విద్యుత్తును వినియోగించుకోవచ్చని సీఎండీలు తెలిపారు. విద్యుత్ శాఖ సిబ్బంది మండపాల వద్ద అందుబాటులో ఉంటారని, ఏ ఇబ్బంది కలిగినా టోల్ ఫ్రీ నెంబర్ 1912కు ఫోన్ చేయాలని వారు కోరారు.
అసెంబ్లీ సాక్షిగా అడ్డంగా దొరికిపోయారు..సీఎం జగన్ పై లోకేశ్ విమర్శలు