telugu navyamedia
రాజకీయ

చర్చలకు తాము సిద్ధం.. మోదీకి ఇమ్రాన్  లేఖ

pm modi to maldives today

పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ ల  మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకీ లేఖ రాశారు. కశ్మీర్ అంశంతో పాటు, పలు వివాదాలపై చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఇమ్రాన్  లేఖలో పేర్కొన్నారు. 

త్వరలో జరగనున్న ఎస్సీవో శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా పాక్ ప్రధానితో ఎలాంటి చర్చలు ఉండబోవంటూ భారత్ స్పష్టం చేసిన నేపథ్యంలో, మోదీకి ఇమ్రాన్ లేఖ రాయడం గమనార్హం. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీకి ఇమ్రాన్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.ప్రాంతీయ అభివృద్ధి కోసం ఇరు దేశాలు కలసికట్టుగా పని చేయాలని లేఖలో ఇమ్రాన్ ఆకాంక్షించారు. ఇరు దేశాల్లోని పేదరికాన్ని అధిగమించేందుకు ఇ చర్చలే ఏకైక మార్గమని తెలిపారు.

Related posts