telugu navyamedia
రాజకీయ

కోడ్ ఉండగానే మోదీపై పుస్తకం విడుదల

ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానేప్రధాని నరేంద్ర మోదీపై రూపొందించిన ఓ పుస్తకం ఇటీవల విడుదలైంది. హిమాచల్ ప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ కుల్దీప్ చంద్ అగ్నిహోత్రి  మోదీపై పుస్తకం విడుదల చేసి వివాదం రేపారు.  ఏప్రిల్ 29న నేషనల్ బుక్ ట్రస్ట్ నిర్వహించిన జాతీయ పుస్తక ప్రదర్శనలో ఈ పుస్తకాన్ని విడుదల చేశారు.  ‘భారత్ బోధ్ కా సంఘర్ష్: 2019 కా మహా సమర్’ పుస్తకాన్ని ధర్మశాల పుస్తక ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. అయితే, ఈ పుస్తకం విడుదల చేయడంపై కులదీప్ చంద్ అగ్నిహోత్రికి కుగ్రా జిల్లా ఎన్నికల అధికారి నోటీసులు జారీ చేశారు. 
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఈ పుస్తకం ఎందుకు విడుదల చేశారో చెప్పాలని ఆ నోటీసుల్లో ఆదేశించారు. దీనిపై అగ్నిహోత్రి స్పందిస్తూ.. ‘‘ఈ పుస్తకం ఏ రాజకీయ నాయకుడికి సంబంధించిన బయోపిక్ కాడు…’’ అని పేర్కొన్నారు.పుస్తకం మొత్తం రాజకీయాల గురించి ఉండబోదన్నారు. ‘‘భారత్ ఎదుర్కొంటున్న సమస్యలు, రాజకీయ పరిణామాలపై లోతైన విశ్లేషణతో పాటు, రాజకీయ దృష్టాంతాలను వివరించడం జరిగిందని తెలిపారు.

Related posts