telugu navyamedia
రాజకీయ వార్తలు

ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్‌ ఉగ్రవాదమే: వెంకయ్య

Venkaiah-Naidu

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్‌ ఉగ్రవాదమేనని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆఫ్రికా దేశాల పర్యటనలో ఉన్న వెంకయ్య సియోర్రాలియోన్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడారు.. ప్రపంచంలోని దేశాలన్నీ ఉగ్రవాదంపై సమష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని, ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాల్ని ఏకాకులను చేయాలని పిలుపునిచ్చారు.

ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలను ఏకాకులను చేయడమే వారికి తగిన గుణపాఠం అవుతుందని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ వేదికపై భారత్‌కు మద్దతుగా నిలుస్తున్న సియోర్రా లియోన్‌ అధ్యక్షుడు జులియస్‌ మాడా బయోకు ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి కృతజ్ఞతలు తెలిపారు. అత్యధిక జనాభా కలిగిన భారత్‌తోపాటు ఆఫ్రికా దేశాలకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తగిన ప్రాధాన్యం కల్పించాల్సి అవసరం ఉందని చెప్పారు.

Related posts