సినీనటుడు చిరంజీవిని ఉయ్యాలవాడ మండలం రూపనగుడి గ్రామానికి చెందిన నరసింహారెడ్డి వంశస్థులు ఆయన స్వగృహంలో కలిశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీర గాథను సైరా నరసింహారెడ్డి పేరుతో చలన చిత్రం తీసి రేనాటి గడ్డ ప్రతిష్ఠను దశ దిశల నిలిపినందుకు చిరంజీవికి కర్నాటి వంశస్థులు నారాయణరెడ్డి, జగన్ మోహన్రెడ్డి, మధు సూదనరెడ్డి, ప్రతాపురెడ్డి తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి ఆయనతో సంతోషాన్ని పంచుకున్నారు.
కోవెలకుంట్లలోని జుర్రేరు, కుందూ నదులు కలిసే ప్రదేశంలో ఏర్పాటు చేస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి శృతి వనం ప్రారంభోత్సవానికి రావాలని రెడ్డి వంశస్థులు చిరంజీవిని కోరగా ఆయన అంగీకరించినట్లు వంశస్థులు తెలిపారు.