telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీ డిపో వద్ద తోపులాట.. స్పృహ తప్పి పడిపోయిన మహిళ

apsrtc protest from mid night today

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉదృతంగా మారింది. జేఏసీ పిలుపు మేరకు నేడు ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. అటు ప్రభుత్వం చర్చలకు రాకపోవడం.. ఇటు కార్మికులు పట్టు విడవకపోవడంతో సమ్మె మరింత ఉదృతంగా మారింది. ఈ క్రమంలో మంగళవారం మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

సమ్మెకు మద్దతుగా వివిధ రాజకీయ పార్టీ నేతలు అక్కడికి చేరుకుని.. తాత్కాలిక డ్రైవర్‌, కండక్టర్‌లకు రేపటి నుంచి విధులకు రావద్దంటూ పూలు ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో మహిళా కార్మికురాలు స్పృహ తప్పి పడిపోయారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Related posts