కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ కరోనా సోకుతోంది. అయితే తాజాగా ఛత్తీస్ గఢ్ లో పలుగురు మావోయిస్టులు కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. దంతేవాడ, బీజాపూర్, సుకుమా జిల్లాల్లో సుమారు 100 మంది మావోయిస్టులు కరోనా బారిన పడ్డారు. కరోనా బారిన పడినవారిలో మోస్ట్ వాంటెడ్ మహిళా మావోయిస్టు సుజాత కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సుజాతపై 25 లక్షల రూపాయలు రివార్డ్ ఉంది. అంతేగాక.. జైలాల్, దినేష్ అనే మావోయిస్టులకు కూడా కరోనా సోకింది. వీరిపై చెరో 10 లక్షల రూపాయల రివార్డ్ ఉంది. అయితే కరోనా ఉన్న మావోయిస్టులు లొంగిపోతే వారికి మంచి వైద్యం అందిస్తామని దంతేవాడ ఎస్పి పిలుపునిచ్చారు.
previous post
next post
మండలికి ఎవరు తాగొచ్చారు.. యనమల వ్యాఖ్యలపై బొత్స ఫైర్