కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ను పరిశీలిస్తున్న టీడీపీ నేతల బృందంపై వైసీపీ గూండాలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పార్టీ టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వర రావు మండిపడ్డారు. వైసీపీ గూండాలు ఇష్టం వచ్చినట్లు దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
గతంలో నందిగామలో శాండ్ మాఫియాను ప్రశ్నించిన విలేకరి గంటానవీన్ ను హత్యచేశారని గుర్తు చేశారు.కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ను పరిశీలిస్తున్న టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ బృందం, సజ్జాఅజయ్ పై మైనింగ్ మాఫియా దాడి చేసిందని ఆరోపించారు.
దౌర్జన్యాలపై ఏం చర్యలుతీసుకుంటారు వైఎస్ జగన్’ అని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ చూస్తుండగానే టీడీపీ నేతలపై కొందరు దుర్భాషలాడుతూ దాడి చేశారన్నారు. ఈ దాడిలో నందిగామ జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి సజ్జా అజయ్ తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు.