telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల తరహా ఫలితాలే: ఉత్తమ్

T Congress boycott mlc elections
లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల తరహా ఫలితాలే వస్తాయని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కు పట్టభద్రులు సరైన గుణపాఠం చెప్పారని ఉత్తమ్‌ అన్నారు. హుజూర్‌నగర్‌లో జరగనున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరయ్యే సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ  కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. 
ఈ సారి రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ఉత్తమ్ జోస్యం చెప్పారు. వచ్చే నెల 1న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో శుక్రవారం గాంధీభవన్‌లో సీఎల్పీ సమావేశం జరగనుంది. కాంగ్రెస్‌ శాసనసభాపక్షనేత మల్లు భట్టివిక్రమార్క నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి ఆర్‌.సి.కుంతియా, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు.

Related posts