తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ పరీక్షలను ఈ నెల 14వ తేదీ వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులు పరీక్ష ప్రారంభం కావడానికి గంటముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఇంటర్బోర్డు అధికారులు పేర్కొన్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రంలోకి అనుమతించే ప్రసక్తేఉండదని ఇదివరకే ప్రకటించారు.
ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు ద్విద్వితీయ సంవత్సరం పరీక్షలను నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 4,63,236 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలోప్రథమ సంవత్సరం విద్యార్థులు 3,00,847మంది కాగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1,62,389 మంది ఉన్నట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ ఏ అశోక్ తెలిపారు.
23మంది టీడీపీ ఎమ్మెల్యేలను చూసి జగన్ భయపడుతున్నారు: ఎమ్మెల్యే గోరంట్ల